తెలంగాణ

హైదరాబాద్‌లో దంపతుల కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ యోగా సెంటర్ నిర్వాహకులు ఓ దంపతులను కిడ్నాప్ చేశారు. ఈనెల 3న మాదాపూర్‌లో అదృశ్యమైన వీరు అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రత్యక్షమైన సంఘటన నగరంలో కలకలం రేపుతోంది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లో కువేందర్ అనే వ్యిక్తి యోగా సెంటర్ నిర్వహిస్తున్నాడు. కాగా గత నెల 27న కిరణ్మయి, జగదీష్ అనే దంపతులు యోగా సెంటర్‌లో చేరారు. వీరు యోగా ప్రాక్టీస్ చేస్తుండగా, యోగా సెంటర్ నిర్వాహకుడు దంపతులిద్దరితో క్షుద్రపూజలు చేయించసాగాడు. అదేవిధంగా వీరిద్దరికి డ్రగ్స్ తీసుకోవడం కూడా అలవాటు చేసినట్టు సమాచారం. అయితే కువేందర్ నార్త్ ఇండియన్‌కు చెందిన వ్యక్తి కావడంతో వారిని డ్రగ్ మత్తులో అరుణాచల్ ప్రదేశ్‌కు తీసుకెళ్లినట్టు కిరణ్మయి, జగదీష్ దంపతుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదిలావుండగా వీరిద్దరికి డ్రగ్స్ అలవాటు ఉండడంతో, డ్రగ్స్ అలవాటు మాన్పించేందుకే అరుణాచల్ ప్రదేశ్ తీసుకెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో యోగాసెంటర్ నిర్వాహకుడు చెప్పాడు. నార్త్‌ఇండియాకు చెందిన కువేందర్ క్షుద్రపూజల కోసమే వీరిని అరుణాచల్ ప్రదేశ్‌లోని కుల్‌కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. యోగాసెంటర్ ముసుగులో క్షుద్రపూజలు చేస్తున్నట్టు వచ్చిన అభియోగాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.