తెలంగాణ

సిఐ విచారణ జివోపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో నిందితుడైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివోపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. వనస్థలిపురం మాజీ ఇన్‌స్పెక్టర్ వై.వెంకటరెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు నిరాకరిస్తూ 2015లో ప్రభుత్వం జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ ఎస్.నరసింగ్‌రావు దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ విచారణకు స్వీకరించారు. అవినీతి కేసులో విచారణ చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు నిందితుడిని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎసిబి కోరిందని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. కేసులో ఉన్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిందితుడిని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన జివోపై స్టే మంజూరు చేస్తూ ఈ కేసును వాయిదావేసింది.