తెలంగాణ
కాంట్రాక్ట్ పనులపై పన్ను వద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అందువల్ల ఈ పనులపై జిఎస్టి వేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. జిఎస్టి అమలు-తీరుతెన్నులపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల చేసిన విజ్ఞప్తిని పరిశీలించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని జైట్లీ వెల్లడించారు.
తదుపరి జిఎస్టి సమావేశం ఆగస్టు 5 న నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ సమావేశంలో వాణిజ్యపన్నుల ఉన్నతాధికారులు సోమేశ్కుమార్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. సోమవారం హైదరాబాద్నుంచి కేంద్రమంత్రి అరుణ్జైట్లీ నిర్వహించిన
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న మంత్రి ఈటల