తెలంగాణ

భర్త అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, జూలై 18: తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మరోసారి భార్య ఆడపిల్లను కంటుం దేమో నని భర్త అనుమానం పెంచుకున్నాడు. నిం డు గర్భిణి అని కూడా చూడకుండా భార్య, కూతు రిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని రావిపహడ్ పం చాయతీ పరిధిలోని తండాలో భార్య, కూతురిని దారుణంగా హత్యచేసిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావిపహాడ్ తండాకు చెందిన మంగ్తానాయక్, గంగమ్మల రెండవ కుమారుడైన శంకర్‌నాయక్ బోరుమోటార్లపై కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి నెమురగొమ్ల గ్రామంనుండి ఏడు సంవత్సరాల క్రితం సరిత అలియాస్ సావిత్రితో వివాహం జరిగింది. అనంతరం వారికి ఇద్దరు కూతుర్లు జన్మించారు. మొదటి కూతురు శ్రీదేవి కాగా రెండవ కూతురు శ్రీనిజ(5). శంకర్‌నాయక్ భార్య సావిత్రిని తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ శంకర్ ప్రవర్తనలో మార్పురాలేదు. తన భార్య ఇద్దరినీ కూతు ర్లనే కందని, భార్యపై కక్షను పెంచుకున్నా డు. సావిత్రి ఇప్పుడు ఏడు నెలల గర్భిణీ. మళ్లీ ఆమె ఆడపిల్లనే కంటుందేమోనని అనుమానం పెం చ కున్న భర్త మంగళవారం తెల్లవారుజామున భార్య సావిత్రి, కూతురు శ్రీదేవి(7)పై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. 90శాతం గాయాలతో ఉన్న వారి ని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతిచెందారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. రమావత్ సురేశ్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సిఐ అర్జునయ్య తెలియజేసారు.