తెలంగాణ
గో సంరక్షణకు అంకితమై పనిచేస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 July 2017
హైదరాబాద్, జూలై 28: గో సంరక్షణకు తాను అంకితమై పనిచేస్తానని, పోలీసు కేసులకు భయపడేది లేదని గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు రాష్ట్ర మంత్రి కె తారకరామారావును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన రాజాసింగ్ అక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎంఐఎం ప్రోద్బలంతో తనను పాత కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 2013 నాటి కేసును తెరపైకి తెచ్చి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తాను ఇలాంటి కేసులకు భయపడేది లేదని చెప్పారు. తనను ఎదుర్కోవాలంటే పెద్ద పెద్ద కేసులతో రావాలని, గోసంరక్షణ కోసమే తాను బతుకుతున్నానని, ఏం చేయడానికైనా తాను సిద్ధమని రాజా సింగ్ పేర్కొన్నారు.