తెలంగాణ

లక్ష మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30:గణపతి ఉత్సవాలకు ఈసారి నగరంలో లక్ష పర్యావరణ గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.జిహెచ్‌ఎంసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విగ్రహాలను పంపిణీ చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. దీంతో పర్యావరణ ప్రేమికులు గత కొంత కాలం నుంచి మట్టితో చేసిన పర్యావరణ విగ్రహాల ఉపయోగంపై విస్తృతంగా ప్రచారం కల్పించారు. దీంతో ఇళ్లలో ప్రతిష్టించే గణపతి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వాటి కన్నా మట్టి విగ్రహాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జిహెచ్‌ఎంసితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.