తెలంగాణ

డ్రగ్స్ అలవాటు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు మంగళవారం నటుడు నందు అలియాస్ ఆనంద కృష్ణను విచారించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటుడు నందు సిట్ కార్యాలయం ఆవరణలోని అమ్మవారి ఆలయంలో పూజ చేసి కార్యాలయం లోనికి వెళ్లారు. నందుతోపాటు అతని తండ్రి సిట్ కార్యాలయానికి వచ్చారు. మొదటి నుంచి ఈ కేసులో తన ప్రమేయం లేదని వాదిస్తోన్న నందు నోటీసులు అందాక విచారణకు హాజరయ్యారు. సోమవారం నాటికి 11మంది సినీ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు 12వ, వ్యక్తిగా నందును విచారించారు. కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, మాదకద్రవ్యాల సరఫరా, ఎవరెవరికి అలవాటు, పంపిణీ విధానం వంటి వాటిని సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారుల ప్రశ్నలకు నటుడు నందు ఆచీతూచి..నెమ్మదిగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ తమ ఇంటా-ఒంట్లో లేదని నందు సిట్‌కు స్పష్టం చేశారు. డ్రగ్స్ వాసనే తెలియదు..కానీ పబ్‌లకు మాత్రం వెళ్తానని సిట్ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. కెల్విన్, జీషాన్ అలీ ఎవరో తెలియదని, డ్రగ్స్ మాఫియా అని మాత్రం తెలుసునని నందు సిట్‌కు చెప్పినట్టు సమాచారం. డ్రగ్స్ వాడకం, సరఫరాపై నందు నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖుల విచారణ మొదటి దఫాగా ముగిసింది. రెండో జాబితాపై కసరత్తు పూర్తి కావచ్చిందని సమాచారం. నేడో, రేపో రెండో జాబితాలోవున్న వారందరికీ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. నందు దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు మరికొంత మంది సినీ పరిశ్రమకు చెందిన వారిని విచారించనున్నట్టు తెలిసింది. అయితే వీరికి అందే నోటీసులు గోప్యంగా ఉంటాయని సమాచారం.
ముగిసిన విచారణ..తదుపరి చర్యపై ఆసక్తి
మాదకద్రవ్యాల కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగిసింది. రోజుకొకరి చొప్పున సిట్ అధికారులు 12 మంది అధికారులను విచారించారు. ఈ కేసులో సిట్ అధికారులు చేపట్టే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపై నోటీసులు ఇచ్చే వారందరిని గోప్యంగా విచారించాలన్న యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గోప్యంగా విచారించనున్నట్టైతే..నోటీసులు కూడా సీక్రేట్ గానే పంపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు విచారించిన వారి వాంగ్మూలాన్ని చార్జీషీట్‌లో ఉంచాలని అధికారులు మీడియాకు తెలిపారు.
విచారణకు వచ్చిన వారు నిందితులా? సాక్షులా?
టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటి వరకు 12మంది సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణకు వచ్చిన వారిలో కొందరిని సాక్షిగానే విచారించామని సిట్ అధికారులు పేర్కొనడంతో..విచారణకు వచ్చిన వారంతా నిందితులా? సాక్షులా? అనే సంశయంలో సినీ ప్రముఖులు ఉన్నారు. కొందరిని సాక్షులుగానే సిట్ పేర్కొనడంతో సినీ ప్రముఖుల్లో ఉత్కంఠ రేపుతోంది. సాక్షులుగానే విచారణ ఎదుర్కొన్నది ఎవరెవరన్నది సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా, విచారించిన వారి వాంగ్మూలాన్ని చార్జ్‌షీట్‌లో ఉంచుతామని సిట్ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో సనీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. కేసు ఎఫ్‌ఐఆర్, నిందితుల అరెస్ట్ అనంతరం 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే అధికారులు ఎప్పుడు..ఎవరి పైన చార్జ్‌షీట్ దాఖలు చేస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు.

చిత్రం.. విచారణ కోసం మంగళవారం సిట్ కార్యాలయానికి వచ్చిన నటుడు నందు