తెలంగాణ

హైదరాబాద్ రానున్న ట్రంప్ కుమార్తె ఇవాంకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారు (పారిశ్రామికవేత్త)ల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఇవాంకా తదితరులు హాజరవుతున్నందుకు సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇవ్వబోతోందని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తుండగా, భారత దేశం తరఫున ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి చూపించడం గొప్ప విషయమని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించినందుకు ప్రధానికి సిఎం ధన్యవాదాలు తెలిపారు.