తెలంగాణ

16న వరంగల్‌లో.. టెక్స్‌టైల్ పార్కుకు సిఎం శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఈ నెల 16న వరంగల్ జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్కుకు సిఎం కెసిఆర్ శంకుస్ధాపన చేయనున్నారు. వరంగల్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ పార్క్ వల్ల స్థానికులకు ఉద్యోగాలు, నేతన్నకు ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సిఎం శంకుస్థాపన చేస్తారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ-సంగెం మండలాల మధ్య రూ.1150 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ పార్క్ ద్వారా దాదాపు 1,13,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. 2014 ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ పార్క్‌కు శంకుస్ధాపన చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పార్క్ ఏర్పాటుకు సిఎం ముందుకు రావడం పట్ల ఉప ముఖ్యమంత్రి కడియం ధన్యవాదాలు తెలిపారు.