తెలంగాణ

బైక్‌పై ‘హరిత’ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: హరితహారంతోనే మానవ మనుగుడ సాధ్యం అనే నినాదంతో వికలాంగుడైన మహేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అభినందించారు. హరిహారం ప్రారంభమైన నాటి నుంచి 37రోజులుగా తెలంగాణలోని అన్ని అన్ని జిల్లాల్లో పర్యటించి శనివారం మంత్రి జోగు రామన్న నివాసానికి మహేష్ చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్‌పేట మండలం లింగాపూర్ తండాకు చెందిన మహేష్‌ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణలో 33 శాతం పచ్చదనాన్ని సాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామాల్లో ప్రచారం చేసినట్లు మహేష్ తెలిపారు. బైక్‌పై హరితహారం బ్యానర్, సిఎం ఫొటోను పెట్టుకుని మహేష్ ప్రచారం చేశారు.