తెలంగాణ

రైతులకు ఏమి ఒరిగిందని కెసిఆర్‌కు అవార్డు: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వ్యవసాయ నాయకత్వ అవార్డు ఇస్తున్నట్లు భారతీయ ఆహార వ్యవసాయ మండలి ప్రకటించడం పెద్ద కుట్ర అని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మండలిని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా ప్రజలను భ్రమింపజేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఆ సంస్థ ఒక ప్రైవేటు వ్యక్తి ఎంజె ఖాన్‌కు చెందినదని, ఆయన ఒక విత్తన కంపెనీల బ్రోకర్ అని డాక్టర్ శ్రవణ్ విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఆ అవార్డు ఏమిటో తెలుసుకోకుండా అభినందించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.