తెలంగాణ
మోదీ, కెసిఆర్ దొందూ దొందే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 August 2017
హైదరాబాద్, ఆగస్టు 21: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దొందు-దొందేనని ఎఐసిసి మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్ విమర్శించారు. ముస్లింలను మభ్య పెట్టేందుకే కెసిఆర్ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. మోదీ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. రైతులపై దాడులు జరుగుతున్నాయని, గోరక్ష పేరిట అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ తన భార్య గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.