తెలంగాణ

మళ్లీ మొదటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఉమ్మడి సర్వీసులను క్రమబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినా, రాష్ట్రప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినా హైకోర్టు తిరిగి యథాతథ స్థితి కొనసాగిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో వ్యవహారం మొదటికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వివిధ స్థాయిలలో పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాని హైకోర్టు ఆదేశాలతో వాటిని సుప్తచేతనావస్థలో ఉంచాల్సి వచ్చిందని అధికరాలు చెబుతున్నారు.