తెలంగాణ

భూ రికార్డు ప్రక్షాళనపై 31న కలెక్టర్ల కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: భూ రికార్డుల ప్రక్షాళనపై క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై మార్గనిర్దేశం చేసేందుకు ఈ నెల 31న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్‌లో కలెక్టర్లలో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు, భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలలో మార్పులు, రిజిస్ట్రేషన్స్ విధానంలో సంస్కరణలు తదితర అంశాలపై విధి విధానాలకు తుదిరూపం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదే రోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ అధికారుల సమావేశం జరుగుతుందన్నారు. రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితీల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఆ సమావేశానికి కూడా హాజరు కానున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రతి మండలంలో రిజిస్ట్రార్ కార్యాలయం
ప్రతీ మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కొనసాగిస్తూ, ఇవీలేని చోట కొత్త కార్యాలయాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రార్లుగా మండల రెవిన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అవినీతికి తావు లేకుండా పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెడుతామన్నారు. కోర్ బ్యాంకింగ్ విధానం మాదిరిగానే ఇక పై భూముల రిజిస్ట్రేషన్, ఆస్తుల క్రయ, విక్రయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో అప్‌డేట్ చేస్తారన్నారు. అన్ని రెవిన్యూ కార్యాలయాల్లో భూ రికార్డుల నిర్వహణ కోసం, కోర్ బ్యాంకింగ్ తరహాలో భూముల క్రయ, విక్రయాల నమోదు కోసం వెయ్యి మంది ఐటీ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఇన్ని కోర్టులు అవసరం లేదన్నారు. కలక్టర్ కోర్టుకు ఒకదానినే కొనసాగించి మిగతా వాటిని రద్దు చేయాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకం, పహాణీలను ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా తయారు చేయాలని సూచించారు. వ్యవసాయానికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి విధి, విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.