తెలంగాణ

అతి పెద్ద వంట కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31 : రాష్ట్రంలో అతి పెద్ద కేంద్రీకృత వంట కేంద్రాన్ని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని అక్షయ పాత్ర సంస్థ నిర్వహించనుంది. కోకాపేట నార్సింగి గ్రామంలో శ్రీకృష్ణ గో సేవామండలి కేంద్రంలో ఈ కేంద్రీకృత వంట కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కింద వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడే తయారుచేస్తారు. ఈ కేంద్రంలో ఏకకాలంలో 75 వేల మంది విద్యార్ధులకు ఒకే చోట వండుతారు. అక్షయపాత్ర ఫౌండేషన్ నెలకోల్పిన ఈ కేంద్రాన్ని బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బ్యాంకు ఆఫ్ టోక్యో సిఇఓ ర్యోచి షింకె, అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస తదితరులు పాల్గొన్నారు.