తెలంగాణ

దోచిపెట్టేందుకే కొత్త రైతు వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: భూ బకాసురులకు దోచిపెట్టేందుకే కొత్త రైతు వ్యవస్థను తెలంగాణ సర్కార్ తీసుకు రావాలని చూస్తోందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను తన కుటుంబం పేరిట యాజమాన్యపు హక్కులను కల్పించుకోవడానికి, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ వంటి భూ బకాసురులకు విలువైన భూములు దోచిపెట్టేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. జివో నెం.39ని జారీ చేసి తెరాస నేతలు, కార్యకర్తల చేతిలో భూముల వివరాలను పెడుతున్నారని విమర్శించారు.

చిత్రం..శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న టిడిపి నేత రేవంత్‌రెడ్డి