తెలంగాణ

బైసన్‌పోలో మైదానం ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వానికి సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో, జింఖానా మైదానం అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ మైదానాలను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించడాన్ని సవాలు చేస్తూ పూర్వ డిజిపి ఎంవి భాస్కరరావు తదితరులు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పాలనపారమైన మరి కొన్ని అంశాలు పరిష్కరించాల్సి ఉందని, అనంతరం ఈ మైదానం తెలంగాణ ప్రభుత్వానికి బదలాయింపు అవుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబోమని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.