తెలంగాణ

కెసిఆర్ పాలనలో బడుగుల బలవన్మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలనలో బడుగుల వరుస బలవన్మరణాలు కొనసాగుతున్నాయని టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇందుకు మానకొండూరు నియోజకవర్గంలో దళితుడు మాంకాళి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన టిఆర్‌ఎస్ నేత, మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్ మృతే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనలు సిఎం కెసిఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. దళితుడు శ్రీనివాస్ మరణానికి కారణమైన స్థానిక శాసనసభ్యుడు రసమయి బాలకిషన్, సిఎం కెసిఆర్‌లపై హత్యా నేరం నమోదు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో జరిగిన అక్రమాలు, నాణ్యతమై ఆందోళన చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిఎం సమావేశం పెట్టి మరీ ఆదేశాలు ఇవ్వడం దారుణమని అన్నారు.