తెలంగాణ

పిడుగుపాటుకు గురైన కుటుంబాలను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుగు గురై చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. పిడుగు పాటు వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిడుగులు పడి చనిపోయిన వారు అంతా నిరుపేదలే కావడం వల్ల వారికి తగిన పరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ఏఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి, పిడుగులు పడతాయో ముందుగా గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలను, స్ధానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కోరారు.