తెలంగాణ

చిన్నారి కిడ్నాప్‌పై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: శంషాబాద్ మండల కేంద్రంలో ఓ చిన్నారి కిడ్నాపైంది. కిడ్నాపై మూడు నాలుగు రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. మహేశ్వరం మండలం పడమటి తండాకు చెందిన జ్యోతి పేదరికం కారణంగా తన కుమార్తె షైనీని శంషాబాద్‌లోని సిద్దాంతి బస్తీలో నివాసముండే రాణి, సురేందర్ దంపతులకు దత్తత ఇచ్చింది. రాణికి మేకగూడకు చెంద హంస నెల రోజుల క్రితం పరిచయమైంది. శుక్రవారం రాణి ఇంటికి వచ్చిన హంస బట్టలు కొనిస్తానని చెప్పి షైనీని వెంట తీసుకెళ్లింది. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాణి దంపతులు ఆర్‌జిఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హంస ఆచూకీ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాప్ జరిగి మూడు రోజులైనా..ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలావుండగా పోలీసులు హంస భర్త అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.