తెలంగాణ

విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయాలని సింగరేణిలోని అన్ని ఏరియా అధికారులకు సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం 11 ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వానల వల్ల కొన్ని ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిందని, వానలు తగ్గుముఖం పట్టడంతో బొగ్గు ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు. లక్ష్యాలను చేరేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్లను ఆయన కోరారు. సింగరేణి కేంద్రశాఖ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.