తెలంగాణ

నేడు సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్లకు సిఎం శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ రెండు జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాల సముదాయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్ణాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో జిల్లా కార్యాలయాల సముదాయానికి, పోలీసు కమిషనరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే సిద్ధిపేట మండలం ఎన్ఫాపల్లి గ్రామంలో మెడికల్ కాలేజి భవన నిర్మాణానికి శంకుస్థాన చేసి అనంతరం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సిరిసిల్లకు చేరుకుని మధ్యాహ్నం 3.15 గంటలకు జిల్లా కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేసాక అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.