తెలంగాణ

కూతుర్ని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, అక్టోబర్ 18: కన్నతండ్రే కాలయముడై కూతుర్ని గొడ్డలితోఅతి దారుణంగా నరికి చంపిన సంఘటన, బుధవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో జరిగింది. ఎండ్రియాల్ గ్రామానికి చెందిన గడ్డం నడిపి బాలయ్య, సాయవ్వలకు ముగ్గురు సంతానం, అందులో శ్రీజ(15) అదే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో10వతరగతి చదువుకుంటోంది. మంగళవారం సాయవ్వ బంధువుల ఇంటికి వెళ్లడంతో, శ్రీజ రోజు మాదిరిగానే, పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చదుకుని పడుకుంది. పడుకున్న శ్రీజ మెడపై గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఆమె తండ్రి పరారయ్యాడు. బుధవారం ఉదయం తల్లి ఊరి నుంచి తిరిగి వచ్చి ఇంటితలుపులు తెరిచి చూడగా, కూతురు శ్రీజ రక్తపు మడుగులోవిగత జీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న చుటుపక్కల వారు తాడ్వాయి పోలీసులకు సమాచారం అందించారు. తాడ్వాయి ఎస్‌ఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి సంఘనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. పోలీసు అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, హత్యకు గల కారణాలను ఆరాతీశారు. అనంతరం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లకు సమాచారం ఇవ్వడంతో, నిందితుడు బాలయ్యను రామారెడ్డి మండలం మద్ది కుంటలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలను మాత్రం నిందితుడు స్పష్టంగా వెల్ల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా బాలిక చదువుల్లో ప్రథమస్థానంలో నిలిచేదని, మూడు సార్లు మెరిట్ స్కార్‌షిప్‌లు పొందిందన్నారు. అలాంటి బాలికను హత్యచేయడం పట లతోటి విద్యార్థి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. మృతురాలికి చెల్లెలు రమ్య, తమ్ముడు రణదీప్ ఉన్నారు. ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ నాగరాజు వివరించారు.