తెలంగాణ

తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు తత్వం: ఈటల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు తత్వం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టెక్కం జనార్దన్ రాసిన పండగ సాయన్న పుస్తకాన్ని మంత్రి ఈటల మంగళవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్యాయాలను, అక్రమాలను ఎదిరించే వారసత్వం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. 19వ శతాబ్దంలో మహబూబ్‌నగరణలో అతి సామాన్య కుటుంబంలో పండగ సాయన్న జన్మించారని చెప్పారు. పేదల ఆకలి తీర్చేవాడని, పెళ్ళిళ్ళు చేసుకోలేని దుర్భరమైన స్థితిలో ఉన్న వారికి సాయం అందించారని ఆయన తెలిపారు. వీరన్నపేటలో ప్రతి సంవత్సరం ఆయన పేరిట జాతర జరుగుతుందని చెప్పారు. ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఆయన తెలిపారు. తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న ఈ వేళ మన వారందరినీ ఆ వేదికలపై గుర్తు చేసుకుంటదామన్నారు. చాలిక ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బందగీ సర్వాయి పాపన్న, పండగ సాయన్న ఇలా ఎవరినీ మరిచిపోలేమని అన్నారు. తెలంగాణ సమాజం గుర్తించే విధంగా మరుగున పడిన వారి చరిత్రలన్నీ సిఎం వెలుగులోకి తెస్తున్నారని మంత్రి తెలిపారు. పండగ సాయన్న పుస్తకం రాసిన టెక్కం జనార్దన్‌ను అభినందించారు.