తెలంగాణ

కెసిఆర్ క్రిస్మస్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20:క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అధికారికంగా ఆదివారం సాయంత్రం నిజాం కాలేజిలో క్రైస్తవ ప్రముఖులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావువిందు ఇచ్చా రు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు హాజరైన చిన్నారులకు గిఫ్ట్‌లు అందజేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు నాయి ని నరసింహారెడ్డి, టి పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు ఎపి జితేందర్‌రెడ్డి, కె కేశవరావు హాజరయ్యారు. క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు సుమారు ఐదువేల మంది ప్రముఖులకు ఈ సందర్భంగా బిర్యానీతో పాటు తెలంగాణ వంటకాలు, కేక్‌లతో సిఎం కెసిఆర్ విందు ఇచ్చారు. సిసిఎల్‌ఎ కమిషనర్ రే మండ్ పీటర్, మైనార్టీ సంక్షేమశాఖ కా ర్యదర్శి ఉమర్ జలీల్, ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలొ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నిజాం కాలేజిలో ఆదివారం జరిగిన క్రైస్తవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కేశవరావు తదితరులు.