తెలంగాణ

కోస్గిలో బస్ డిపో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: పూర్వ మహబూబ్‌నగర్, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పలు వరాలు ప్రకటించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరుల బృందం మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా వారు చేసిన వినతి మేరకు కోస్గి మండల కేంద్రంలో బస్ డిపో, కొడంగల్‌లో ఫైర్ స్టేషన్, కోస్గి మండల కేంద్రంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి, మహేందర్‌రెడ్డి తదితరులు