తెలంగాణ

వచ్చే ఏడాది నుండి తెలుగు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుండి ఇంటర్ వరకూ అమలుచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.అన్ని స్థాయిల్లో విద్యార్ధులకు ఇబ్బంది కలుగని రీతిలో తెలుగు భాషను ఆసక్తికరంగా, స్కోరింగ్ సబ్జెక్టుగా తీర్చిదిద్దాలని అన్నారు. తెలుగు భాష తప్పనిసరి అమలుచేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేస్తున్న విధానాన్ని అనుసరించి సిబిఎస్‌ఇ , ఐసిఎస్‌ఇ బోర్డులలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేయడంపై సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో మాతృభాషను తప్పనిసరిగా అమలుచేస్తున్న తీరుపై సబ్ కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
మొదటి తరగతి నుండి ఇంటర్ వరకూ వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా, ఐదో తరగతి వరకూ తెలుగు భాషను చదువుకోని వారికి ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్ధతిలో సబ్జెక్టును నేర్చుకునే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నామని అన్నారు.
అదే విధంగా ఏడో తరగతి వరకూ తెలుగు చదువుకోని వారికి, ఎనిమిది , పదో తరగతి వరకూ తెలుగు చదువుకోని వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేందుకు వేర్వేరుగా పుస్తకాలను రూపొందిస్తున్నామని అన్నారు. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ బోర్డులలో కూడా తెలుగుభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలులో ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెప్పారని అధికారులు పేర్కొన్నారు.
తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మార్చడంలో అది విద్యార్థులకు ఆసక్తికరంగా అభివృద్ధి చేయడంతో పాటు స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలుగు సబ్జెక్టుకు సిలబస్, పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయాలని కడియం శ్రీహరి సూచించారు.
భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌పై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై న్యాయసలహా తీసుకోవాలని అన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, విద్యాశాఖ సంచాలకుడు కిషన్, తెలుగు అమలు కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, కన్వీనర్ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకరరావు, ఎస్సీఇఆర్‌టి డైరెక్టర్ శేషుకుమారి, తెలుగు అకాడమి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, హెచ్‌ఎం సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..తెలుగు భాష తప్పనిసరి అమలుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, విద్యాశాఖ
అధికారులతో సమీక్ష జరుపుతున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి