తెలంగాణ

హైదరాబాద్‌లో వైకాపా పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలో మీటర్లకు చేరుకున్న సందర్భంగా, జగన్‌కు సంఘీభావంగా ఆ పార్టీ నాయకులు హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్వర్యంలో ‘వాక్ విత్ జగన్’ పేరిట లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి పెద్దమ్మ గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నాయకులు వాసిరెడ్డి పద్మ, మతీన్, బొడ్డు సాయినాథ్ రెడ్డి, ప్రపుల్లా రెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, వి. రాంమోహన్, బండారు వెంకటరమణ, కె. విశ్వనాథ్ చారి, బత్తుల నాని, అవినాష్‌గౌడ్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.