తెలంగాణ

ఫిబ్రవరి 10న లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్‌లో 2018 ఫిబ్రవరి 10 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉభయ తెలుగు రాష్ట్రాల లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి.ఆర్. మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కాంపౌండ్‌లో (పురాని హవేలి) నిర్వహించే ఈ లోక్ అదాలత్‌లో ప్రధానంగా ప్రమాదాలకు సంబంధించిన బీమా, బ్యాంకుల కేసులు పరిష్కరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ స్థాయిలలోని కోర్టుల్లో ఉన్న ఈ తరహా కేసులకు సంబంధించిన పిటీషనర్లు, బీమాసంస్థలు, బ్యాంకర్లు లోక్ అదాలత్‌కు హాజరు కావాలని సూచించారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు త్వరగా ప్రజలకు న్యాయం అందించాలన్నదే లోక్ అదాలత్ ఉద్దేశమని మధుసూదన్‌రావు వివరించారు. ఉన్నతస్థాయి కోర్టుల ఆదేశాలమేరకే లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు.