తెలంగాణ

గాంధీ భవన్‌లో మహాత్ముడికి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: మహాత్మ గాంధీ ఆశయాలు దేశానికే కాదు ప్రపంచానికీ ఆదర్శమని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మహాత్మ గాంధీ 90వ వర్ధంతి సందర్భంగా మంగళవారం గాంధీ భవన్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకుని రావడంలో మహాత్మ గాంధీ చేసిన కృషి అమోఘమని అన్నారు. ప్రస్తుతం దేశంలో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరించడం లేదని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మహాత్మ గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచరిస్తున్న సమయంలో దేశంలో గాంధీ సిద్ధాంతాలను మరుగున పడేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అహింసా, శాంతి, సహనం మహాత్ముని సిద్ధాంతాలు ప్రపంచానికి అవసరమని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు, టీ.పీసీసీ కోశాధికారి గూడు రు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నిరంజన్, అధికార ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.