ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి నమూనా ఆలయం 7న ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో తీర్చిదిద్దిన శ్రీవేంకటేశ్వర స్వామి నమూనా ఆలయం ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. నమూనా ఆలయ నిర్మాణం పనులను టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు గురువారం ఉదయం పరిశీలించారు. 7వ తేదీ నుంచే ఈ ఆలయంలో భక్తులను అనుమతిస్తామని, తిరుమలలో జరిగినట్టే నిత్యపూజులు, విశేష సేవలను నిర్వహిస్తామన్నారు. వెయ్యిమంది వరకూ సభ్యులున్న సేవాబృందాలు పాల్గొంటాయన్నారు. స్వామివారికి పుష్కర స్నానం, హారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.