మహబూబ్నగర్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
వంగూరు, జనవరి 1: వంగూరు ఎక్స్రోడ్ దగ్గర గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వంగూరు నుంచి కాశీం(22), హరీష్లు కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కల్వకుర్తి నుంచి ప్రకాశ్, ఆనంద్, శివ, ప్రశాంత్లు కలిసి మరో ద్విచక్ర వాహనంపై వంగూరుకు వస్తుండగా వంగూరు ఎక్స్రోడ్ దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ప్రకాశ్(18) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన ఈరటి కాశీంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ప్రశాంత్ అనే యువకునికి ఎలాంటి గాయాలు కాలేదు. తీవ్ర గాయాలైన వారిలో హరీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారికి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.