తెలంగాణ

విద్యార్థులపై లాఠీచార్జీ చేస్తే సహించం: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్సలర్ అప్పారావుపై ఎలాంటి చర్యా తీసుకోకుండా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దారుణమని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులపై మరోసారి లాఠీలు ఝుళిపిస్తే తాము ఉపేక్షించేది లేదన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు.