తెలంగాణ

ఎస్సీ వర్గీకరణ చర్చా వేదికలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై నగరంలో శుక్రవారం జరిగిన చర్చా వేదికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బషీర్‌బాగ్‌లోని పిజి లా కాలేజీలో చర్చావేదిక ప్రారంభం కాగానే మాల సంక్షేమ సంఘం కార్యకర్తలు తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను నిలదీశారు. చర్చావేదికను వ్యతిరేకిస్తున్న వీరు నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తలకు గాయం కాగా వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిశాక పోలీసులు అక్కడికి చేరుకోగానే మాల సంక్షేమ సంఘం ప్రతినిధులు పరారయ్యారు. చర్చావేదికలో ఇలా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం మంచిది కాదని ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.