రాష్ట్రీయం
విజయవాడలో దారుణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 July 2018
విజయవాడ: నగరంలోని పాయకాపురం శివారులో ఓ యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతిని ఆమె సహచర విద్యార్థి ఒకడు పార్టీకి అని పిలిచి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి తాగించాడు. స్పృహ తప్పిన ఆమెను శివారు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం స్నేహితులను పిలిపించాడు. నలుగురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తులో ఉన్న యువతిని, పక్కనే తచ్చాడుతున్న యువకులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువతిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మత్తులో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనుంచి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి శ్రావణి వెల్లడించారు.