విజయనగరం

తోటపల్లి కాలువ తారకరామ ప్రాజెక్టుకు అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, సెప్టెంబర్ 23: తోటపల్లి కాలువను తారకరామ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం తారకరామ ప్రాజెక్టు డిఇ సన్యాసప్పారావు, తోటపల్లి ప్రాజెక్టు జెఇపి. రవికుమార్ తంగుడిబిల్లి గ్రామంలోని భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా తారకరామ ప్రాజెక్టు డిఇ సన్యాసప్పారావు మాట్లాడుతూ తోటపల్లి కాలువను తారకరామ ప్రాజెక్టు అనుసంధానం చేయడానికి 20 కోట్ల నిధులతో అంచనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఈ అనుసంధానం విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి అని వెల్లడించారు. తొలుత తారకరామ తీర్థసాగర్ నుంచి తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. తోటపల్లి కాలువను తారకరామ తీర్థసాగరానికి అనుసంధానం చేస్తే విజయనగరం పట్టణానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా సతివాడ, కొత్తపేట, తంగుడిబిల్లి భూములను పరిశీలించామని వెల్లడించారు. పరిశీలనలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సవ్వాడ వనజాక్షి, టిడిపి మండల అధ్యక్షులు గేదెల రాజారావు, తారకరామ ప్రాజెక్టు జెఇ ఆర్.రామునాయుడు ఉన్నారు.