విజయనగరం

పాడేరు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 12: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. బాక్సైట్ జోలికోస్తే గిరిజన ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరకుతామంటూ విశాఖపట్టణం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డిక ఈశ్వరి హెచ్చరించడం దుర్మార్గమని చెప్పారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈశ్వరి దిష్టిబొమ్మను శనివారం ఇక్కడ కాళ్ల నాయుడు మందిరం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఈశ్వరి ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ బహిరంగసభలో ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం దారుణమన్నారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి తల నరుకుతానంటూ ఎమ్మెల్యే బహిరంగ సభలో ప్రకటించడం క్షమించారని విషయమని అన్నారు. ఎమ్మెల్యే ఈశ్వరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, పార్టీ నాయకులు ఐవిపిరాజు, పసగాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.