విజయనగరం

గ్రూపులు వీడండి-పార్టీకి పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, నవంబర్ 4: గ్రూపు రాజకీయాలు మాని అందరూ కలసి పార్టీకి పనిచేయాలని వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం కొత్తవలసలోగల శ్రీరామ కల్యాణ మండపంలో శృంగవరపుకోట నియోజకవర్గ స్థాయివైకాపా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్.కోట వైకాపా ఇన్‌చార్జ్జి నెక్కల నాయుడుబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో పార్టీని పటిష్ట పరచాలని కోరారు. జిల్లాలో నాయకుడు ఎవరనేది ముఖ్యం కాదని, అందరూ కలసి పార్టీకి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్జి కృష్ణదాసు మాట్లాడుతూ 2019లో అధికారం వైకాపాదేనని చెప్పారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలలో వైకాపా గెలుస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరం కష్టపడి పనిచేయాలన్నారు. కేంద్ర పాలక మండలి సభ్యుడు సాంబశివరాజు మాట్లాడుతూ జిల్లాలో నాయకుడు ఎవరనేది ముఖ్యం కాదని, పార్టీ ముఖ్యమని, అందరం పార్టీకి పనిచేసి పూర్వ వైభవానికి వైకాపాకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు చిన్న శ్రీను, నాయుడుబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.