విజయనగరం

నేడు వైసీపీలో భారీ చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 23: మెంటాడ మండల కేంద్రంలో బుధవారం వై ఎస్సార్ సిపి రచ్చబండ కార్యక్రమం సందర్భంగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరనున్నారని మండల కన్వీనర్ రెడ్డిసన్యాసినాయుడు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వై ఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జ్ భూమన కరుణాకరరెడ్డి రానున్నారని తెలిపారు. రచ్చబండ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చొక్కాపు సన్యాసినాయుడు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రెడ్డిరాజప్పలనాయుడు, టిడిపి మాజీ విప్ పొట్నూరు రామలింగేశ్వరరావు, ఆండ్ర సర్పంచ్ కుంచు చంద్రావతి, సర్పంచ్ తిరుపతి, రమణమ్మ తదితరులు భూమాన సమక్షంలో పార్టీలో చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావులు హాజరవుతారని చెప్పారు. మండలంలోని పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తరలిరావాలని కోరారు.

రామగోపాల్‌వర్మను అరెస్టు చేయాలి
గజపతినగరం, జనవరి 23: భారతీయ సంస్కృతిని హిందూ మహిళల మనోభావాలను కించపరచే విధంగా సినిమా(జిఎస్‌టి) తీసిన దర్శకుడు రామగోపాలవర్మను తక్షణమే అరెస్టు చేయాలని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మంగళవారం ఎస్సై వరప్రసాద్‌కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా కార్యకర్తలతో కలసి ఆమె ఎస్సైకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో అశ్లీలతకు పీటవేసి మహిళల మనోభావాలను కించపరచే విధంగా సన్నివేశాలను చిత్రకరించారని అన్నారు. దీనివలన దేశ సంస్కృతి దిగజారిపోవడంతోపాటు యువత చెడుమార్గంలో ప్రయాణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి నీచ సినిమాలు తీసిని వర్మను అరెస్టు చేయడంతోపాటు సినిమా ప్రదర్శించకుండా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.