విజయనగరం

నేడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హనుమజ్జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (పూల్‌బాగ్),మే30: పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం విశేషపూజలు నిర్వహిస్తామని పైడితల్లి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజాతెలిపారు.సోమవారం తన కార్యాలయంలో హనుమజ్జయంతి వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పైడితల్లి అమ్మవారి ఆలయ దత్తాలయమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామివారికి వేకువజాము ఐదు గంటలనుండి 11గంటలవరకు విశేష పంచామృతాభిషేకం, లక్ష తమలపాకులసేవ, సింధూరపూజలు జరుగుతాయని చెప్పారు. ఈసమావేశంలో ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు, నగేష్ ఆచార్యులు,రామారావు,రమణమూర్తి సిబ్బంది పాల్గొన్నారు.