విజయనగరం

రోడ్డు నిర్మాణ పనులు సత్వరం పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మార్చి 22: పట్టణంలో రోడ్ల నిర్మాణపనులను త్వరిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. 13,14 వార్డులలో రోడ్ల నిర్మాణపనులకు మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజుతో కలిసి చైర్మన్ రామకృష్ణ శంకుస్థాపన చేశారు. 14వ వార్డు పరిధిలో 52 లక్షల రూపాయలతో సుంకరివీధి, బొందెలగూడెంలో రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా 13 వార్డులో కాటవీధి పార్కులో ఐదు లక్షల రూపాయలతో ప్రహరీగోడ నిర్మాణంతోపాటు పార్కులో అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. బెస్తవీధి కాలనీ పార్కులో 9.20లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజలు దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ మత్స్యరాజు, 14వ వార్డు కౌన్సిలర్ సుంకరి విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పసగాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.