విజయనగరం

పదోన్నతుల ఉత్తర్వులు వెంటనే జారీచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 22: భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతి ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీచేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు కురమాన జోగారావు అధ్యక్షతన ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై కార్యవర్గం చర్చించారు. ప్రధానంగా పిఇటిలు, పండిట్ ఉపాధ్యాయ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు విడుదలలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం జాప్యం చేయకుండా భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని శ్యామ్ డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించాలని, అడ్‌హాక్ నిబంధనలపై ఎంఇఓ పోస్టులను తక్షణం నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. 398 పేస్కేల్‌పై నియమితులైన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. నెలవారీ పదోన్నతులు కల్పించాలన్నారు. కంట్రిబ్యూటరీ పింఛన్ విధానంపై ఉపాధ్యాయులకు పూర్తి సమాచారంతో కూడిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరావు, జిల్లా ఉపాధ్యక్షుడు మురళీ, జిల్లా కార్యదర్శులు రవి, దొర, చిట్టిబాబు పాల్గొన్నారు.