విజయనగరం

అభివృద్ధి పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 26: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎ మ్మెల్యే మీసాల గీత ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అభివృద్ధి పనులపై అధికారులు, కౌన్సిల్ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అభివృ ద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని తెలిపారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు ప్రగతి పనులను సమీక్షించాలని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం జారీచేసిన జీవో-279ను పటిష్టవంతంగా అమలు చేయాలని అన్నారు. వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కణపాక, అయ్యన్నపేటలలో కొత్త భవనాలను పన్నులు వేయాలని, అనధికార మంచినీటి కుళాయి కనెక్షన్‌లపై దృష్టి సారించాలని చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం, మున్సిపల్ రెవెన్యూ విభాగాల పనితీరును మరిం త మెరుగుపర్చుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ జి.నాగరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సైలాడ త్రినాధరావు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు పిఎస్‌వివి ప్రసాద్, ఎస్.మత్స్యరాజు, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి.శోభన్‌బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.