విజయనగరం

పెండింగ్ పనులను శరవేగంగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి (రూరల్), జూలై 26: పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను శరవేగంగా పూర్తిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు, కాలువలు అసంపూర్తిగా ఉన్నవాటిని శరవేగంగా పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే వర్షాలు పడడంతో పనులు జరగడానికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. పనులను సకాలంలో పూర్తిచేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులను పర్యవేక్షించాలని ఆమె అన్నారు. నాణ్యత కొరవడకుండా పనులను చేపట్టాలని కోరారు. పనులు చేసిన వాటికి నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అదే విధంగా పట్టణంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వర్షాలకు ఎక్కడైనా రోడ్లు, కాలువలు మరమ్మతులకు గురైనా తెలియజేస్తే వాటికి నిధులు మంజూరు చేసి బాగు చేయిస్తామన్నారు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డిఇ రమేష్‌బెహరా, అధికారులు పాల్గొన్నారు.