విజయనగరం

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 29: జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ శుక్రవారం పట్టణంలోని పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకున్న ఆయన మొదట పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రధాన పూజారి, ఇఓ, విజయనగరం ఆర్‌డిఓ శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ శ్రీనివాసరావు, పౌర సంబంధాలశాఖ అసిస్టెంటు డైరెక్టర్ జయరావు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు కలెక్టర్‌కు పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు అనంతరం కలెక్టర్‌కు సాంప్రదాయం ప్రకారం శాలువా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు.