రాష్ట్రీయం

యాదాద్రి పేరిట కొత్త జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి నేత మోత్కుపల్లి డిమాండ్ * నేడు లక్ష్మీ నరసింహస్వామికి విజ్ఞాపన

హైదరాబాద్, డిసెంబర్ 31: యాదగిరిగుట్ట జిల్లా కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సిఎం కెసిఆర్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రకటించే కొత్త జిల్లాల జాబితాలో యాదాద్రి జిల్లా పేరు ఉండాలని కోరారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఆయన టిటిడిపి మహిళావిభాగం అధ్యక్షురాలు బండ్రు శోభారాణితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించే విధంగా కెసిఆర్ బుద్ధి మార్చాలని శుక్రవారం యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి విజ్ఞాపన పత్రం అందించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాదగిరిగుట్లను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. గతంలో ఇదే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆలేరు నుంచి యాదగిరి గుట్ట వరకు పాదయాత్ర కూడా చేయడంతో పాటు డిసెంబర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగిందని అన్నారు. యాదగిరి గుట్ట వరకు మెట్రో రైలు తీసుకువస్తే అటు ప్రభుత్వానికి మంచిపేరు రావడంతో పాటు ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.