ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 December 2015
విశాఖః ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష పదజాలంతో దూషించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో 124(ఎ) 307, 506, 511సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని చింతపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ తెలిపారు. రెండు రోజుల కిందట చింతపల్లి ఆర్టీసీ మైదానంలోజరిగిన వైసీపీ బాక్సైట్ వ్యతిరేక సభలో ఈశ్వరి మాట్లాడుతూ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో సీఎం చంద్రబాబు తల తెగనరుకుతామని ఉద్వేగంతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.