కరీంనగర్

కిడ్నాపైన బాలుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), జనవరి 22: ఈనెల 17న కిడ్నాప్‌కు గురైన నగరంలోని భగత్‌నగర్‌కు చెందిన వొరుసు లక్ష్మిప్రసాద్(7) అనే బాలుడు హత్యకు గురైనట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. కిడ్నాపైనట్లు భావిస్తున్న నాటినుంచి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఆచూకీ లభించలేదు. స్థానికులు ఉదయం వేళ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం నేరస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సిఐ కట్ట హరిప్రసాద్ తెలిపారు.