తెలంగాణ
1422 గ్రామాల్లో మిషన్ భగీరథపై సర్వే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 May 2017
హైదరాబాద్, మే 15: మిషన్ భగీరథ పథకం ప్రభావంపై మే 29 నుంచి ఆగస్టు 31 వరకు ఇంటింటి సర్వే జరుపుతారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు డాటా విశే్లషణ చేస్తారు. నవంబర్ 1 నుంచి 30 వరకు తుది నివేదిక ఇస్తారు. 1422 గ్రామాలను సర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో 126 గ్రామాల్లో ఎస్సీ జనాభా, 320 గ్రామాల్లో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 480 వార్డుల్లో సర్వే చేస్తారు. ప్రతి గ్రామంలోని ఎనిమిది ఇళ్లలో మొత్తం 12000 ఇళ్లలో సర్వే జరుపుతారు. సెస్ చరిత్రలో అతి పెద్ద సర్వే అని సెస్ పేర్కొంది. సామాజిక, ఆర్థిక సర్వేలో మిషన్ భగీరథ ఏ విధంగా ఉపయోగపడుతుందో తేలుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ తెలిపారు.