రాష్ట్రీయం
సీమను తాకిన రుతుపవనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 June 2017
అనంతపురం, జూన్ 7: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను బుధవారం తాకాయి. దీంతో చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాను నైరుతి రుతుపవనాలు తాకినట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలకరి వానలు కురుస్తుండటంతో రైతన్నలు ఏరువాకకు సిద్ధమవుతున్నారు.
అనంతపురంలో కమ్ముకున్న కారుమేఘాలు